telugu navyamedia
రాజకీయ

23  అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఆధిక్యం!

chandrababu met nri in amaravati

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి అధికార తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ రోజు ఉదయం కౌంటింగ్ మొదలైన తొలి రౌండ్ లోనే పరిస్థితి  అర్థమైపోయింది. రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీడీపీకి ఓటమి తప్పదన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 23  అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

అద్దంకి, చీరాల, కందుకూరు, పర్చూరు, హిందూపురం, ఇచ్ఛాపురం, కుప్పం, తాడికొండ, రేపల్లె, గుంటూరు వెస్ట్, పాతపట్నం, తిరువూరు, కైకలూరు, విజయవాడ ఈస్ట్, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, వైజాగ్ ఈస్ట్, వైజాగ్ సౌత్, వైజాగ్ వెస్ట్, పెద్దాపురం, మండపేట, రామచంద్రాపురం, బాపట్ల అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు  ఆధిక్యతలో  ఉన్నారు.

Related posts