సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే గాల్వన్లో చైనా దాడి చేసిందని అన్నారు. భారత ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోకుండా మొద్దు నిద్రపోయింది. దీంతో మన వీర జవాన్లు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ చేసిన వ్యాఖ్యలను ఆయన పోస్ట్ చేశారు. చైనా ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ దాడి జరిగిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. ఈ విషయంలో తాము రాజీపడబోమని ఆయన అన్నారు.
విభజన వల్ల రాజధానిని నష్టపోయాం: మంత్రి ధర్మాన