telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

స్కూళ్ల రీఓపెన్ పై కేంద్రం క్లారిటీ!

school students

దేశంలో అన్ లాక్ 4.0 ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. తాజా అన్ లాక్ మార్గద్ర్శకాలపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి వివరణ ఇచ్చారు. ఇప్పట్లో పాఠశాలలు తెరిచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ ప్రకటించబోయే ఆంక్షల సడలింపులో స్కూళ్లు ఉండవని వెల్లడించారు.

ఇప్పటికే దేశీయ విమాన సర్వీసులు, బస్సులు తిరుగుతుండగా.. మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. అనేక రాష్ట్రాల నుంచి మెట్రో సేవలపై డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. స్కూళ్లు తెరుచుకునేందుకు మరికొంతకాలం సమయం పట్టే అవకాశముంది.

Related posts