తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 2,058 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,60,571కి పెరిగింది. నిన్న రాత్రి 8 గంటల వరకు మొత్తం 51,247 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల మొత్తం సంఖ్య 22,20,586కు పెరిగింది. గత 24 గంటల్లో కరోనా కాటుకు 10 మంది బలయ్యారు. మొత్తంగా ఇప్పటి వరకు 984 మంది కరోనా కారణంగా మృతి చెందారు. నిన్న ఒక్క రోజే 2,180 మంది కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు. దీంతో ఇప్పటి వరకు 1,29,187 మంది వైరస్ బారినుంచి బయటపడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్ ద్వారా తెలుస్తోంది.
వివేకానందరెడ్డి హత్యలో టీడీపీ నేతల ప్రమేయం: షర్మిల