telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రైవేటు యూనివర్శిటీల్లో రిజర్వేషన్లు వర్తించవు: సబితా ఇంద్రారెడ్డి

Sabitha indrareddy

తెలంగాణ అసెంబ్లీలో ప్రైవేటు వర్శిటీల బిల్లు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పాటు కానున్న ప్రైవేటు యూనివర్శిటీల్లో రిజర్వేషన్ల విధానం వర్తించదని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా ఉండదని పేర్కొన్నారు. విద్యా ప్రమాణాలను పెంచడమే తమ లక్ష్యమని అన్నారు. అందుకోసం అనేక చర్యలను తీసుకుంటున్నామని ఆమె చెప్పారు.

ప్రైవేటు కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను మరింతగా పెంచేందుకు తీసుకుంటున్న చర్యలతో గతంలో ఉన్న 350 కాలేజీలు, ఇప్పుడు 180కి తగ్గాయని గుర్తు చేశారు. ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు 2018లోనే చట్టం తెచ్చామని తెలిపారు. వర్శిటీలను ఏర్పాటు చేస్తామంటూ 16 సంస్థలు ముందుకు రాగా, తొలి దశలో ఐదు వర్శిటీలకు మాత్రమే అనుమతించామని అన్నారు. మహీంద్ర, హోస్టన్, మల్లారెడ్డి, అనురాగ్, ఎస్ఆర్ వర్శిటీలు ఏర్పడనున్నాయని తెలిపారు.

Related posts