telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వివేకానందరెడ్డి హత్యలో టీడీపీ నేతల ప్రమేయం: షర్మిల

ys sharmila press meet

బాబాయ్ వివేకానందరెడ్డి హత్యలోటీడీపీ నేతల ప్రమేయం ఉందని వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ హత్యలో మంత్రి ఆదినారాయణరెడ్డికి కానీ, టీడీపీ నేతలకు కానీ సంబంధం లేకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీకి ఎందుకు ఒప్పుకోవడం లేదో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. సోమవారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవన్నారు. ఒకవేళ గొడవలు ఉంటే చంపుకొంటామా అని ఆమె ప్రశ్నించారు.

తమ కుటుంబానికి వైఎస్ వివేకానందరెడ్డి పెద్ద దిక్కుగా ఉండేవారని ఆమె చెప్పారు. ఆయనను అత్యంత దారుణంగా హత్య చేశారని అన్నారు.మాది వివేకా హత్యకు గురైన బాధిత కుటుంబం అని చెప్పుకొచ్చారు. కానీ ఈ హత్యను తామే చేశామని టీడీపీ నేతలు చంద్రబాబు మాట్లాడడాన్ని ఆమె తప్పుబట్టారు. బాధితులనే నిందితులుగా చేర్చే కుట్ర జరిగితే తాము ఆత్మరక్షణలో పడుతామన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డిని దారుణంగా హత్య చేశారని ఆమె గుర్తు చేశారు. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలోనే వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారని ఆమె ప్రస్తావించారు.

 

Related posts