ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విరుచుకుపడ్డారు. విజయనగరం జిల్లా గజపతినగరం రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న ఎన్నికలకు కేసీఆర్ కు సంబంధం లేకున్నా కేసీఆర్ ను ఓడించండి అంటూ చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వలాభం కోసం చంద్రబాబు ఇంతలా దిగజారిపోవాలా? అని అన్నారు.
విజయనగరం జిల్లా అంటే రాజశేఖరరెడ్డికి ఎంతో ప్రేమ అని చెప్పారు. టీడీపీ పాలనలో ఈ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. గోస్తని, చంపావతి నదుల అనుసంధానం జరగలేదని విమర్శించారు. నాకు అనుభవం ఉందని చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఆరువందలు హామీలు ఇచ్చారు. ఒక్కటైనా నెరవేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందీస్తే చంద్రబాబు వాళ్ల కార్యకర్తల సంక్షేమం తప్ప మరేదీ చూడలేదని విమర్శించారు.