నేడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం జరగనుంది. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్కు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తారని వినిపిస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు ఆయన్ను అధ్యక్షుడిగా నియమించాలని చర్చ జరుగుతోంది. మరోవైపు కర్ణాటకు చెందిన మల్లికార్జున ఖర్గే కూడా అధ్యక్ష పదవికి రేసులో ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొనేందుకు యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్, హరీశ్ రావత్, మీరా కుమార్, అహ్మద్ పటేల్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
కాంగ్రెస్, బీజేపీలకు మెజారిటీ రాదు: ప్రకాశ్ రాజ్