అమెరికాకు చెందిన ఇద్దరు ప్రవాస భారతీయ వ్యాపారులు తిరుమల శ్రీవారికి శుక్రవారం రూ.14 కోట్ల భారీ విరాళం అందజేశారు. టీటీడీ అధికారుల సమాచారం మేరకు విదేశాల్లో ఉన్న ఇండియా వ్యాపారులు వరలక్ష్మి అమ్మవారి వ్రతం రోజు శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డికి రూ.14 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్ను అందజేస్తూ, తమ పేర్లను గుప్తంగా ఉంచాలని కోరారు.
తాము ఇచ్చిన విరాళాన్ని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా సంక్షేమ ట్రస్టులకు వినియోగించాలని ఆలయ అధికారులను కోరారు. ఈ ఇద్దరు గత సంవత్సరం జూలైలోనూ రూ.13.5 కోట్లను టీటీడీ ట్రస్టులకు విరాళంగా ఇవ్వడం విశేషం. హైదరాబాద్కు చెందిన మరో భక్తుడు గురువారం రూ.1.11 కోట్లను టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కు విరాళంగా అందజేశారు.