భవిష్యత్తులో మరిన్ని వైరస్లు వ్యాప్తి చెందే ప్రమాదముందని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) వెల్లడించింది. మానవాళిని కబళించే అవకాశం ఉందని, అప్రమత్తం కాకుంటే తీవ్ర నష్టం తప్పదని ఇంటర్నేషనల్ హెచ్చరించింది. ఈ మేరకు ‘కోవిడ్–19: అర్జెంట్ కాల్ టు ప్రొటెక్ట్ పీపుల్ అండ్ నేచర్’ తాజా నివేదికలో పేర్కొంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ఆపకుంటే, వన్యప్రాణులకు హాని తలపెడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలిపింది.
ప్రాణాంతక, ప్రమాదకరమైన వ్యాధులు, వైరస్లు చెలరేగిపోవడం ఖాయమని అందులో ఆందోళన వ్యక్తం చేసింది.1990ల నుంచి మనుషుల్లో బయటపడిన కొత్త వ్యాధుల్లో దాదాపు 70 శాతం వన్యప్రాణుల నుంచి వచ్చినవేనని, అదే సమయంలో 178 మిలియన్ హెక్టార్ల అడవి కనుమరుగైపోయిందని, దీనిని బట్టి అడవి, వ్యాధుల మధ్య ఉన్న సంబంధం ఏంటనేది అర్థం చేసుకోవచ్చని తెలిపింది.పర్యావరణ పరిరక్షణకు సమప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్ అన్నారు. చాలా వరకు వైరస్లు వన్యప్రాణులు, జంతువుల నుంచే సోకుతున్నాయని అన్నారు.