telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మీడియా మిత్రుల కృషి నిరుపమానం: చంద్రబాబు

chandrababu

ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియా మిత్రులందరికి ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. వృత్తిపరమైన ఒత్తిళ్లను అధిగమించి, పాలకుల వేధింపులను తట్టుకుని, నిష్ఫాక్షికంగా వార్తలను అందిస్తూ ప్రజా చైతన్యం కోసం మీడియా మిత్రులు చేస్తున్న కృషి నిరుపమానమైందని కొనియాడారు.

సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో, అణగారిన వర్గాల హక్కుల సాధనలో కీలక భూమిక మీడియాదేనని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచారని, ‘కరోనా’పై పోరాటంలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్లుగా మీడియా మిత్రులు ఉన్నారని కొనియాడారు. ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభం ‘మీడియా’అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Related posts