నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంపై వైసీపీ అధినాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా పంపారు. ఆయన వ్యవహారం తెల్చేందుకు వైసీపీ ఎంపీలు రేపు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. వీరి వెంట కొందరు లాయర్లు కూడా వెళ్లనున్నారు.లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో వైసీపీ ఎంపీలు భేటీకానున్నారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని వారు కోరనున్నారు. ఈ నేపథ్యంలో రఘురాజు స్పందించారు. ఎంపీల ఢిల్లీ పర్యటనతో ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన అన్నారు.
జగన్ కు తెలియకుండానే అన్నీ జరుగుతున్నాయని ఇప్పటి వరకు అనుకున్నానని తెలిపారు. ఢిల్లీకి ఎంపీలు, లాయర్లను ప్రత్యేక విమానంలో పంపిస్తున్నారంటే, అంతా జగన్ కనుసన్నల్లోనే జరుగుతోందనే విషయం ఇప్పుడు అర్థమైందని చెప్పారు. ప్రజా సమస్యలను ప్రస్తావించిన వారందరినీ పార్లమెంటు నుంచి సాగనంపితే పార్లమెంటులో ఎవరూ మిగలరని అన్నారు. పార్టీకి, సీఎంకి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రఘురాజు చెప్పారు.
కేసీఆర్ ఎవరిని కలవడానికి ఢిల్లీకి వస్తున్నారు: బీజేపీ ఎంపీ సంజయ్