telugu navyamedia
రాజకీయ వార్తలు

చైనా సైనికులు రెట్టింపు సంఖ్యలో హతమయ్యారు: కేంద్ర మంత్రి

minister ravisankar on economy

తూర్పు లడక్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాల్వాన్ ఘర్షణలో మన జవాన్లు 20 మంది అమరులయ్యారని అన్నారు. అదేవిధంగా చైనా సైనికులు రెట్టింపు సంఖ్యలో హతమయ్యారని చెప్పారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందన్నారు. అయితే ఎవరైనా దుష్ట చూపు చూస్తే మాత్రం గట్టి సమాధానం చెపుతుందని తెలిపారు.

ఇప్పుడు అందరూ రెండు ‘సీ’ల గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. వాటిలో ఒకటి చైనా కాగా, రెండోది కరోనా వైరస్ అని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎంత మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారో కూడా చైనా ఇంత వరకు ప్రకటించలేదని అన్నారు. మన జవాన్ల త్యాగాలను వృథా పోనివ్వబోమని ప్రధాని మోదీ చెప్పారని అన్నారు.

Related posts