telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

కూకట్ పల్లిలో చిరుత సంచారం.. భయం గుప్పిట్లో స్థానికులు

హైదరాబాద్, కూకట్ పల్లి పరిధిలో ఓ చిరుతపులి కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రాత్రింభవళ్ళు ఎంతో బిజీగా ఉండే కూకట్ పల్లి ప్రాంతంలో ఓ చిరుతపులి కనిపించడం చర్చనీయాంశమైంది. అది ఓ వ్యక్తిపై దాడి చేసిందని వార్తలు రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రగతినగర్‌ గాజులరామారం మధ్య ఈ చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు స్థానికులు చిరుతపులి ఫోటోలను, వీడియోలను తమ స్మార్ట్ ఫోన్లలో బంధించి, సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో అవి వైరల్ అయ్యాయి.

విషయం తెలుసుకున్న అటవీ అధికారులు, చిరుత తిరుగుతోందని భావిస్తున్న ప్రాంతానికి వచ్చి, స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అది అసలు చిరుతపులేనా అన్న కోణంలో విచారిస్తున్నామని అన్నారు. కాగా, చిరుత సంచారం వార్తలతో ప్రగతినగర్ వాసులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ ప్రాంతంలో కొండలు, చెట్లు ఉండటంతో మరో ప్రాంతం నుంచి తప్పించుకుని చిరుత ఇక్కడికి వచ్చిందని స్థానికులు అంటున్నారు.

Related posts