telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ ఎవరిని కలవడానికి ఢిల్లీకి వస్తున్నారు: బీజేపీ ఎంపీ సంజయ్

bandi samjay mp

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు ఎవరిని కలవడానికి వస్తున్నారో చెప్పాలని బీజేపీ ఎంపీ సంజయ్ ప్రశ్నించారు. సోమవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ నుంచి ఎల్లయ్య వస్తారా.. మల్లయ్య వస్తారా అన్న కేసీఆర్ కు కొత్తగా జ్ఞానోదయం అయినట్లుందని సంజయ్ అన్నారు.

కేంద్ర పెద్దల గురించి తన స్థాయికి తగినట్లు మాట్లాడాలని కేసీఆర్‌కు సూచించారు. కార్మికులను చర్చలకు పిలవాలని కోర్టు చెప్పినా కేసీఆర్ స్పందించలేదని దుయ్యబట్టారు. 30 మంది ఆర్టీసీ కార్మికులు, 100 మంది సామాన్య ప్రజల చావుకు కేసీఆర్ కారణమయ్యాడని ఆరోపించారు. ఇప్పుడు తానే సమస్యను పరిష్కరించాననే నీచ స్థితిలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు.

Related posts