telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ ప్రచారం తప్ప… యువత కోసం చేసింది లేదు

harish rao trs

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నుండి స్థానిక సంస్థలకు, హైదరాబాద్ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చే అవకాశం లేదని చెప్పాడని…బండి సంజయ్ కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాం అని అబద్ధాలు చెబుతున్నాడని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. వరదలు వస్తే బెంగుళూరుకు 600, గుజరాత్ 500 కోట్లు ఇచ్చారు… కానీ తెలంగాణకు పైసా కుడా ఇవ్వలేదని ఫైర్‌ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ను రద్దు చేసి… నగర యువత ఉద్యోగలు, ఉపాధి లేకుండా చేశారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నదని…బీజేపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగిస్తూ ఉద్యోగుల తీసివేస్తున్నారని ఆగ్రహించారు. నల్లధనం బీజేపీ నాయకుల జేబుల్లోకి వెళ్లాయని… బీజేపీ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం తప్ప యువత కోసం చేసింది లేదన్నారు. యువత బీజేపీకి బుద్ధి చెప్పాలని… పఠాన్ చెరువు నియోజకవర్గం మెడికల్ డివైస్ పార్కు, ఐటీ పార్కులు ఏర్పాటుతో యువతకు ఉపాధి రాబోతుందని తెలిపారు. టీఆర్ఎస్  జీహెచ్ఎంసి మేనిఫెస్టో అన్ని వర్గాలకు మేలు చేసేదిగా ఉందని తెలిపారు.

Related posts