కొందరి ఆలోచనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రముఖుల జన్మ తేదీలను బట్టి కొందరు, ప్రత్యేక సందర్భాలను బట్టి మరికొందరు చిన్నారులకు పేర్లు పెడుతుంటారు. తాజాగా అలాంటి ఓ ప్రత్యేకమైన పేరే ఒడిషాకు చెందిన చిన్నారికి పెట్టారు. వివరాల్లోకి వెళితే.. ఒడిషా రాజధాని భువనేశ్వర్లో ఉన్న రైల్వే ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం 11.30కు 32 ఏళ్ల మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిట్టి తల్లికి ‘ఫణి’ అని పేరు పెట్టారు. ఒడిషా తీరప్రాంతాన్ని ఫణి తుఫాన్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బిడ్డకు ఫణి అని నామకరణం చేశారు. ఆ మహిళ మంచేశ్వర్లోని కోచ్ రిపేర్ వర్క్ షాపులో హెల్పర్గా పని చేస్తోంది. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
previous post
కారవాన్ అనేది కనీస అవసరాలకు మాత్రమే… చిరంజీవి, తమ్మారెడ్డి కామెంట్స్