ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల పార్థివ దేహానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నానక్రామ్గూడలోని కృష్ణ నివాసానికి చేరుకొని విజయ నిర్మల భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు సీఎం జగన్ వెంట ఉన్నారు.
విజయనిర్మల భౌతికకాయానికి శుక్రవారం ఉదయం చిత్ర పరిశ్రమతోపాటు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, సినీ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, బీవీఎస్ ప్రసాద్ వాళులు అర్పించారు.