తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల్ జిల్లా ధర్మపురి మండలం, నేరెళ్లశివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న ఇసుక టిప్పర్ను వెనుక నుంచి వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నాందేడుకు చెందిన ట్యాంకర్ డ్రైవర్ విజయ్ సజీవ దహనమయ్యాడు. ఆయిల్ ట్యాంకర్ నాందేడు నుంచి రామగుండం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
previous post
next post