telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అమెరికా హెచ్చరికలు… పాక్ మీదుగా వెళ్లే విమానాలకు ఉగ్ర ముప్పు

PLane

పాక్ గగనతలం మీదుగా వెళ్ల తమ దేశ విమానాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) గతేడాది మార్చి 23న హెచ్చరికలు జారీచేసింది. ఇవి 2019 డిసెంబరు 31 వరకు అమల్లోని ఉంటాయని పేర్కొన్న అధికారులు.. వీటిని 2021 జనవరి 1 వరకు తాజాగా పొడిగించారు. అమెరికా పౌర విమానయానానికి పాక్ గగనతలంలో ముప్పు పొంచి ఉందని, ముఖ్యంగా తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలకు మరింత ప్రమాదమని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు తన అధికారిక వెబ్‌సైట్‌లో డిసెంబరు 30 సమాచారాన్ని ఉంచిన ఎఫ్ఏఏ… భారత్-పాక్ ఉద్రిక్తలు కూడా ఇందుకు కారణమని వివరించింది.

“పాక్ భూభాగం, గగనతలం నుంచి రాకపోకలు సాగించే అమెరికా విమానాలకు ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉంది.. కశ్మీర్‌‌లో ఆందోళనలు నేపథ్యంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా విమానాశ్రయాలను మూసివేస్తారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనికులపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడగా.. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న భారత వాయుసేన పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరంపై మెరుపు దాడులు చేసింది. దీంతో భారత్ స్థావరాలపై పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రయత్నించింది. తమ భూభాగంలోకి వచ్చిన రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశామని పాక్ ప్రకటించింది. భారత, పాక్ సైన్యం వద్ద ఉపరితలం నుంచి గాల్లోకి, గాల్లో నుంచి గాల్లోకి ప్రయోగించి సామర్థ్యం కలిగిన అధునాతన క్షిపణి వ్యవస్థ ఉంది. ఇవి సాధారణంగా పౌర విమానాలు ప్రయాణించే ఎత్తు అంతకు మించిన లక్ష్యాలను చేరుకోగలవు. పౌర విమానాలను కూల్చివేయడం ఇరు దేశాల ఉద్దేశం కాకపోయినా సైన్యం ప్రయోగించిన ఆయుధాల వల్ల పొరపాటున వాటికి తాకి కూలిపోయే ప్రమాదం ఉంది. కశ్మీర్‌లో ఘర్షణలకు ప్రతిస్పందనగా పాకిస్థాన్, పొరుగు ఉన్న ఎయిర్ నావిగేషన్ సర్వీసు ప్రొవైడర్లు తమ గగనతలాన్ని రక్షించుకునే క్రమంలో పౌర విమానాలను శత్రువుల యుద్ధ విమానాలుగా భావించిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి” అని హెచ్చరించింది. అంతేకాదు, పాక్ భూభాగంలోని ఉగ్రవాదుల నుంచి కూడా అమెరికా విమానాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. చిన్న చిన్న ఆయుధాలతో కాల్పులు, ఎయిర్‌పోర్టుల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, ఫిబ్రవరి 26 తర్వాత పాకిస్థాన్ తన గగనతలాన్ని కొద్దిరోజుల పాటు మూసివేసింది. వైమానిక స్థావరాలను కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అటు, భారత ప్రధాని, రాష్ట్రపతి విమానాలు సైతం తమ గగనతలం మీదుగా ప్రయాణించకుండా ఆంక్షలు విధించింది.

Related posts