telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సాక్షి మీడియా కథనంపై స్పందించిన సోమిరెడ్డి

somireddy brother into ycp today

సీఎం జగన్ చెప్పినట్టుగా సాక్షి మీడియాలో వచ్చిన కథనంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. “రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని వైఎస్ జగన్ చెబుతున్నారు. దీనిని మొదటిసారిగా సీఎం జగనే గుర్తించినట్టున్నారున్నారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాజధాని గురించి ప్రస్తావించకుండా పొరబాటు చేశారేమో! అని అభిప్రాయపడ్డారు.

సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అంట! ఆయన ఎటువెళితే అటు అధికారులంతా పెట్టేబేడా సర్దుకుని గుడారాలు వేసుకుంటే సరిపోతుందంటూ సోమిరెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. మొత్తానికి రాజధాని అంటే సరికొత్త నిర్వచనం చెబుతున్నారని, ఈ మాత్రం ఆలోచన 72 ఏళ్లు పరిపాలించిన వారికి కూడా లేకపోయింది అంటూ ఎద్దేవా చేశారు. జయలలిత ఊటీ నుంచి పరిపాలించారని చెబుతున్నారని, మన రాష్ట్రంలో కూడా హార్సిలీ హిల్స్, అరకు వంటి ప్రాంతాలున్నాయని, అక్కడి నుంచి పరిపాలన సాగించుకోవచ్చని చురకలంటించారు.

Related posts