అమెరికా మోటార్ బైక్ దిగ్గజ సంస్థ హార్లే డేవిడ్సన్ భారత్ లో తమ షోరూంలను మూసివేయనున్నట్టు తెలుస్తోంది. హైఎండ్ బైక్ గా పేరుగాంచిన ఈ మోటార్ సైకిల్ కు చాలా దేశాల్లో ఫ్యాన్ క్లబ్ లు కూడా ఉన్నాయి.
భారత్ లోనూ దీనికంటూ ప్రత్యేకంగా అభిమానులున్నారు. కానీ మార్కెట్ పరంగా హార్లే డేవిడ్సన్ కు భారత్ ఏమాత్రం కలిసిరాలేదు. దాంతో చేసేదిలేక భారత మార్కెట్ నుంచి తప్పుకోవాలనుకుంటోంది.పది సంవత్సరాల క్రితం భారత్ లో అడుగుపెట్టిన హార్లే డేవిడ్సన్ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరపలేకపోయింది.
2020 ఆర్థిక సంవత్సరాంతానికి ఈ అమెరికా దిగ్గజ సంస్థ 2,500 బైక్ లను మాత్రమే విక్రయించగలిగింది. అంతేకాదు భారత్ లోని తన యూనిట్ నుంచి 2,100 బైక్ లను మాత్రమే ఎగుమతి చేయగలిగింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా2.10 లక్షల హార్లే డేవిడ్సన్ బైకులు విక్రయాలు జరిగాయి.
భారత్ పరిస్థితులకు అనుగుణమైన బైక్ ల రూపకల్పన చేయలేకపోవడం, ఇతర కంపెనీల నుంచి ఎదురైన పోటీకి తగిన చర్యలు తీసుకోకపోవడం హార్లే డేవిడ్సన్ కు ప్రతికూలంగా మారింది.
మంగళగిరిలో తనకు సరైన పోటీ లోకేష్ కాదు: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే