telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘కే ట్యాక్స్’ పేరిట వందల కోట్లు.. ఎవ్వరూ తప్పించుకోలేరు: విజయసాయిరెడ్డి

వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన కోడెల కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. ప్రజలను బెదిరించి ‘కే ట్యాక్స్’ పేరిట వందల కోట్లు దోచుకున్నారన్నారు. దీనికి సహకరించిన అధికారులు కూడా దోషులే అని పేర్కొన్నారు. నిర్బంధ వసూళ్ల మాఫియా అరాచకాలపై దర్యాప్తు జరుగుతుందన్నారు.

బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.గత ఎన్నికల్లో ఎలాగోలా గెలవాలని 99% రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో అమలు కాని హామీలను చేర్చేవారని. చంద్రబాబులాంటి వారు గెలిచాక మేనిఫెస్టోను మాయం చేయడం కూడా చూశాం. జగన్ గారు మాత్రం దాన్నో పవిత్ర గ్రంథంలా భావిస్తున్నారని విజయసాయిరెడ్డి కొనియాడారు. 

Related posts