telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

దుబాయ్ ఎడారిలో మహేష్…

మహేష్ బాబు నటించనున్న నూతన సినిమా సర్కారు వారిపాట. ఈ సినిమా షూటింగ్ మొదలయింది. ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా జాతీయ అవార్డు గ్రహిత కీర్తీ సురేష్ ఇందులో హీరోయిన్‌గా కనిపించనుంది.మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. మహేష్ ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటాడు. నిన్న ఐన్ 5 దుబాయ్ బిల్డింగ్ షేర్ చేసిన మహేష్, తాజాగా షార్జాలోని ఇసుక ఎడారుల దిబ్బలను అభిమానులతో పంచుకున్నాడు. “షార్జాకు సమీపంలో ఉన్న మ్లైహాలో సర్కారు వారి పాట ను చిత్రీకరిస్తుండడం అద్భుతమైన అనుభూతి కలిగిస్తోంది. ఈ ప్రాంతానికి సంబంధించిన కథలు, అద్భుతమైన లొకేషన్లు బాగా నచ్చాయని” ట్విట్టర్ లో మహేష్ పేర్కొన్నాడు. మహేష్ దుబాయ్ ఉత్సాహం చూస్తుంటే అక్కడే షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేలా ఉన్నాడంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ చిత్ర బృందం సినిమా రిలీజ్ డేట్‌ను ఇటీవల ప్రకటించింది. అన్ని అనుకున్నట్లే జరగితే ఈ సినిమాను వచ్చే 2021 ఆగస్టులో విడుదల చేసేందుకు చూస్తున్నారు

Related posts