సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై యంగ్ హీరో కార్తికేయ హీరోగా నవంబర్ నుంచి నూతన చిత్రం ప్రారంభం కానుంది. అయితే టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద వినూత్నమైన సినిమాల్ని నిర్మిస్తూ సినీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై వచ్చిన కుమారి 21 ఎఫ్, ఉప్పెన వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కార్తికేయ అప్ కమింగ్ మూవీ చావు కబురు చల్లగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని చూసి అందులో కార్తికేయ పెర్ఫార్మెన్స్ కి ఇంప్రసై సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఓ సినిమాను నిర్మించడానికి సుకుమార్ ప్లాన్ చేశారు. నవంబర్ లో ప్రారంభం అవ్వనున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు సుకుమార్ అందిస్తున్నారు. దర్శకుడు, తదితర వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల అవ్వనున్నట్లు తెలిపారు. అయితే చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది. ఇక ప్రస్తుతం మార్చి 19న విడుదల అవ్వనున్న తన కొత్త సినిమా విదుదల పనుల్లో బిజీ గా ఉన్నాడు.
previous post
నీ స్పీడ్ కాంగ్రెస్ లో చెల్లదు ..రేవంత్ కు వీహెచ్ చురకలు