telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మొదటి రోజు పూర్తి… 263/3 తో ఇంగ్లాండ్

ఆసీస్ పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత భారత జట్టు ఇంగ్లాండ్ తో తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే చెన్నై వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు పూర్తయింది. అయితే ఆట ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును కెప్టెన్ జో రూట్, డొమినిక్ సిబ్లీ ఆదుకున్నారు. అయితే ఆట ముగిసే చివరి క్షణంలో చివరి బంతికి సిబ్లీ(87) ఔట్ కావడంతో 263/3 తో ఇంగ్లాండ్ నిలిచింది. అయితే మూడో వికెట్ కు రూట్ తో కలిసి సిబ్లీ 200 భాగసౌమ్యం నెలకొల్పారు. ఇక ఇదే క్రమంలో రూట్ తన 20 వ శతకాన్ని పూర్తి చేసుకొని ఆట ముగిసే సమయానికి 128 పరుగులతో నాట్ ఔట్ గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ లో బుమ్రా రెండు వికెట్లు తీయగా అశ్విన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. అయితే ఈరోజు ఆటలో పై చేయి ఇంగ్లాండ్ ద్ అని చెప్పాలి. ఆట మధ్యలో దాదాపు 65 ఓవర్ల వరకు వికెట్ తీయలేకపోయారు భారత బౌలర్లు. ఈరోజు ఆట చివరి బంతికి వికెట్ సాధించాడు బుమ్రా. దాంతో ఇక చూడాలి రేపు రెండో రోజు ఆటలో రూట్ తో కలిసి ఆడేందుకు ఎవరు వస్తారు… ఏం చేస్తారు అనేది.

Related posts