telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

పోలింగ్‌ అధికారి పై బీజేపీ కార్యకర్తల దాడి

last day for nominations

యూపీలో మంగళవారం లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. మొరదాబాద్‌లోని బిలారిలో ఓ పోలింగ్‌ బూత్‌ వద్ద బీజేపీ కార్యకర్తలు ప్రిసైడింగ్‌ అధికారి పై దాడికి పాల్పడ్డారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను ప్రిసైడింగ్‌ అధికారి కోరారని దాడికి పాల్పడ్డ బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు.

యూపీలో బీఎస్పీతో పొత్తుతో పోటీ చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గుర్తు సైకిల్‌ కావడం గమనార్హం. సైకిల్‌ బటన్‌ను ప్రెస్‌ చేయాలని ప్రిసైడింగ్‌ అధికారి మహ్మద్‌ జుబైర్‌ మహిళా ఓటర్లను ఒత్తిడి చేయడంతో తాము అడ్డగించామని బీజేపీ కార్యకర్తలు తెలిపారు. బీజేపీ నేతల ఫిర్యాదుతో సదరు అధికారిని పోలింగ్‌ విధుల నుంచి తప్పించారు.

Related posts