telugu navyamedia
క్రీడలు వార్తలు

జో రూట్ సెంచరీ…

ఆసీస్ లో అద్భుతమైన విజయం సాధించి తిరిగి వచ్చిన తర్వాత భారత జట్టు ప్రస్తుతం చెన్నై వేదికగా భారత్-ఇంగ్లాడ్ మధ్య మొదటి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మొదట 63 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను రూట్-సిబ్లీ కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ 184 పరుగుల భాగసౌమ్యం నెలకొల్పడంతో ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ టెస్టులో తన 20 వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు అయితే ప్రస్తుతం రూట్(114) పరుగుల వద్ద ఉండగా సిబ్లీ(85) పరుగుల వద్ద బ్యటింగ్ చేస్తున్నాడు. దాదాపు గత 60 ఓవర్ల నుండి భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు..అయితే ఈ రోజు ముగియడానికి కేవలం ఇంకా 7 ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఈ మ్యాచ్ లో ఈరోజు ఇంకా ఒక్క వికెట్ అయిన పడుతుందా.. లేదా అనేది.

Related posts