telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కవిత

kavitha trs

నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టరేట్ లో రిటర్నింగ్ ఆఫీసర్ కు కవిత తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో స్థానిక సంస్థల ఓట్లు మొత్తం 824 ఉన్నాయి. ఇందులో 532 ఓట్లు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవే. మిత్రపక్షం ఎంఐఎం పార్టీకి కూడా ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 140, బీజేపీకి 85 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఓట్లను బట్టి చూస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత సునాయాసంగా గెలుస్తుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Related posts