telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ పాలన చూసి నారా వారి నరాలు చిట్లిపోతున్నాయి: రోజా

roja ycp mla

ఏపీ సీఎం జగన్ సుపరిపాలన చూసి నారా వారి నరాలు చిట్లిపోతున్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్‌ది ఉన్మాద పాలన అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపైఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎవరిది ఉన్మాద పరిపాలనో ప్రజలు ఎన్నికల్లో చెప్పారు. 23 సీట్లు మాత్రమే ఇచ్చి చంద్రబాబును మూలన కూర్చోబెట్టారు. ఏ అవసరం ఉందని ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు.

దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గొప్ప ఆలోచనలతో జగన్‌ పథకాలు అమలు చేస్తున్నారు. తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు తీరు ఉంది. మద్యం పాలసీపై చంద్రబాబు నాయుడు తాగు బోతుల సంఘానికి అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారు. తాగుబోతులకు మద్దతుగా ఆయన మాట్లాడుతున్నారు. జగన్‌పై బురద ఎలా చల్లాలనే విషయంపై భూతద్దాలతో వెతుకుతున్నారు’ అని విమర్శించారు.

Related posts