telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బాగా ఆలోచించి ఓటు వేయాలి: పవన్

pawan-kalyan

ప్రతినిధులను ఎన్నుకునే ముందు బాగా ఆలోచించి ఓటు వేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. ఈరోజు ఉదయం కర్నూలు ఓల్డు సిటీ లోని హంద్రీ నదిపై డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించారు. బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడం వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధ్యత గల ప్రజాప్రతినిధులను ఎన్నుకోకపోతే జరిగే నష్టం ఇలాగే ఉంటుందని అన్నారు.

ప్రజలకు డబ్బులు పడేశాం కనుక ఓట్లు వేశారని, ఇక వారికి పని చేయాల్సిన అవసరం లేదని నాయకులు భావిస్తున్నారన్నారు. రెండేళ్లు అయినా చిన్నపాటి జోహరాపురం బ్రిడ్జిని కూడా పూర్తి చేయలేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. గత ప్రజాప్రతినిధి, ప్రస్తుత ప్రజాప్రతినిధి మధ్య తగాదాల కారణంగా ప్రజలకు ఉపయోగపడే నిర్మాణం నిలిచిపోవడం బాధాకరమన్నారు.

Related posts