telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ..పర్చూరులో పోలీస్ పికెట్

ycp letter to CS on praja vedika building

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లాలోని పర్చూరు మండలం నూతలపాడులో ఇరువర్గాల మధ్య నిన్న అర్ధరాత్రి వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా ఇరువర్గాల మధ్య ఘర్షణలకు దారితీసింది.

దీంతో గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేశారు. పరిస్థితి మరింత దిగజారకుండా ఈరోజు ఉదయాన్నే పోలిస్ పికెట్ ఏర్పాటుచేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు ఇరువర్గాలను హెచ్చరించారు.

Related posts