telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆస్ట్రేలియాపై వరుణిడి కరుణ.. అయినా సిరీస్ సొంతం చేసుకున్న భారత్…

ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో నాలుగవ మ్యాచ్ కు ఆటంకాలు, దీనితో ఫలితం తేలేపరిస్థితి కనిపించడం లేదు. ఎలాగూ వెనకబడి ఉన్న ఆతిద్యజట్టును ఈ మ్యాచ్ లో కూడా ఓడించి, సిరీస్ గెలుపుకు ఇంకాస్త బలాన్ని చేకూర్చే ప్రయత్నం వాతావరణం అనుకూలించక నీరుగారిపోయేట్టుగానే ఉంది. అయినా ఇప్పటికి విజయం భారత టీం సొంతం, కానీ ఆఖరి టెస్ట్ లో గెలుపు అంచున ఉండి, ఇలా జరగటం అటు అభిమానులకు, ఇటు ఆటగాళ్లకు కాస్త నిరాశనే మిగులుస్తుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో విజయం ముంగిట నిలిచిన భారత్ ఆశలను వర్షం అడియాసలు చేసేలా కనిపిస్తోంది. నాలుగో రోజు ఆటకు పలుమార్లు అంతరాయం కలిగించిన వర్షం ఐదో రోజు కూడా ఆటంకం కలిగించింది. వర్షం ఆగకుండా కురుస్తుండడంతో ఆట ప్రారంభం కాలేదు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటలకు అంపైర్లు పిచ్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. భారత్ కంటే 316 పరుగులు వెనకబడి ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 622/7 వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌట్ అవడంతో ఫాలో ఆన్ ఆడుతోంది. దీంతో ఆసీస్ పరాజయం తప్పదని భావించారు. అయితే, వరుణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్ జరగడంపై సందేహాలు నెలకొన్నాయి. మ్యాచ్ రద్దయినా 2-1తో సిరీస్ భారత్‌ సొంతమవుతుంది.

Related posts