telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. రహదారి పనులకు బ్రేక్!

AP

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుత్తేదారులకు షాకిచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పోలవరం కాంట్రాక్టును రద్దుచేసిన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పంచాయతీరాజ్ శాఖలో భారీస్థాయిలో జరుగుతున్న 3,543 రహదారి పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ పనుల విలువ రూ.1,031.17 కోట్లుగా ఉందని సమాచారం.

పంచాయతీరాజ్ తో పాటు ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక కింద చేపడుతున్న పనులను జగన్ సర్కారు నిలిపివేసిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 2018, ఏప్రిల్ కు ముందే అనుమతి పొందినప్పటికీ ఇంకా పనులు ప్రారంభించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related posts