telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆక్రమిత కాశ్మీర్ కోసం.. పాక్ ఒక్క అడుగు వేస్తే ..

india ready to action for pok on pak steps

భారతదేశం ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ గురించి మాత్రమే పాక్ మీద విరుచుకుపడేది. ఇప్పుడు తన పంథా మార్చుకొని పీఓకే మీద భారత్ గళం విప్పుతుంది. కాశ్మీర్ ను భారత్ ఏ విధంగా అయితే తన భూభాగంలో కలిపేసుకుందో, పాక్ అలా కలిపేసుకొనే సీన్ లేదు. దీనితో పాక్ ఎక్కడ లేని ఆందోళనకు గురవుతుంది. ఒక దేశం అభివృద్ధిపధంలో ఉండాలంటే పొరుగు దేశాలు కూడా మంచివి అయి ఉండాలి. దేశంలో ఉగ్రదాడులు జరిపి దేశాన్ని అస్థిర పరచాలని చాలా సార్లు ప్రయత్నించింది. అయితే ఇప్పుడు కాశ్మీర్ విషయంలో మరో దేశంలో మారణ హోమం జరపాలని పాక్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. పాక్ ఆర్మీ ఉగ్రవాదులతో కలిసి దాడులు జరపాలని భావిస్తునట్టు భారత్ ఇంటెలిజెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. రేడియో సిగ్నల్ ద్వారా పాక్ ఆర్మీ కాశ్మీర్ లో ఉన్న కొంత మందితో మాట్లాడ్తున్నట్టు తెలుస్తుంది.

ఈ సారి పాక్ ఎటువంటి విధ్వంసానికి పాల్పడిన భారత్ పీఓకే లోకి దూసుకుపోవటం ఖాయంగా కనిపిస్తుంది. కాశ్మీర్ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశంలో పాక్ లేవనెత్తడంతో భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాశ్మీరు మా అంతర్గత వ్యవహారం. ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించమని గట్టి హెచ్చరిక చేసింది. ఇప్పటికే పలు దేశాలు కాశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పిన సంగతీ తెలిసిందే. అయితే మొన్నటి వరకు కాశ్మీర్ విషయంలో ఒక విధంగా స్పందించిన పాక్ ఇప్పుడు ఏకంగా ఐక్యరాజ్య సమితి సమావేశంలో కాశ్మీర్ భారత్ లో ఒక రాష్ట్రమని చెప్పడం సంచలనం రేపుతోంది. ఇలా పాక్ రోజుకొక స్టేట్మెంట్ ఇస్తూ ఆ దేశపు డొల్లతనాన్ని బయట పెట్టుకుంటుంది.

Related posts