తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం దగ్గర పడడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తొలి విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో సోమవారం నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఇందుకు సంబంధించి ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యా హ్నం 5 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అభ్యర్థుల నుంచి ఈనెల 7నుంచి 9వరకు నా మినేషన్లను స్వీకరిస్తారు. మూడు రోజుల పాటు మాత్రమే నామినేషన్లను అందజేయాల్సి ఉంటుంది.
ఈనెల 13వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేరోజు బరిలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారనేది రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. ఈనెల 21న గ్రామ పంచాయతీ ఎన్నికలను ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 2 గంటల నుంచి ఓట్ల లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.
ఎన్నికల సంఘం ఏకపక్షం: యామిని