‘కరోనా’ వస్తే భయపడాల్సిన పని లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని అన్నారు. ఒకవేళ రాష్ట్రంలో ‘కరోనా’ కనుక వ్యాపిస్తే తమ సర్వ శక్తులు ఒడ్డి ఎదుర్కొంటామని చెప్పారు.
శాసనసభా సమావేశాలు రద్దు చేసి, ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గంలో వాళ్లు మాస్క్ లు కట్టుకోకుండానే పని చేస్తారని వ్యాఖ్యానించారు .22 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే ఆ వైరస్ నశించిపోతుందని, ఈ రాష్ట్రంలో ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలకు చేరుతోంది కనుక భయపడాల్సిన అవసరం లేదని ఆ సైంటిస్ట్ చెప్పారని పేర్కొన్నారు.