telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేవంత్ పై చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నాం: తలసాని

talasani srinivasayadav on clp merger

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై డ్రోన్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ తో చిత్రీకరించారనే అభియోగాలతో కేసు నమోదైంది. ఈ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ, రేవంత్ పై చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నామని చెప్పారు.

కేటీఆర్ కు ఫామ్ హౌస్ లేదని… వేరే వాళ్లు కట్టుకున్న ఫామ్ హౌస్ ను లీజ్ కు తీసుకుని ఉంటున్నారని తెలిపారు. 111 జీవోను ఎత్తేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని… ఈ జీవోను పెంచి పోషించింది కాంగ్రెస్, టీడీపీలేనని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై మాట్లాడుతూ, జనాభాను బట్టి వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

Related posts