telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డికి దిమ్మదిరిగే షాక్‌..

revanth shabbir ali

దుబ్బాక ఉప ఎన్నిక విజయం తర్వాత బీజేపీ మరింత దూకుడు పెంచింది. గ్రేటర్‌ ఎన్నికల్లో జెండా ఎగురవేయాలనే ఉత్సాహంతో ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యలోనే ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తోంది. తాజాగా కాంగ్రెస్‌ నేత బీజేపీలో చేరారు. దీంతో ఎల్ బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు కొప్పుల నర్సింహారెడ్డి బీజేపీలో చేరారు. కొప్పుల నర్సింహారెడ్డిని కండువా కప్పి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీలోకి ఆహ్వానించారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, బి.జె.వై.ఎం.జాతీయ కార్యదర్శి కాచం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి… కిషన్ రెడ్డి నివాసంలో బీజేపీలో చేరారు కొప్పుల నర్సింహారెడ్డి. చేరిన వెంటనే కొప్పులకు మంచి ఆఫర్‌ ఇచ్చింది బీజేపీ. ముషిరాబాద్ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా కొప్పుల బరిలోకి దిగనున్నారు. కొప్పుల నర్సింహారెడ్డి బాటలోనే మరికొందరు కాంగ్రెస్‌ నేతలు ఉన్నట్టు సమాచారం అందుతోంది. కొప్పుల బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో రేవంత్ వర్గం షాక్ గురైంది. మొన్నటి దాకా రేవంత్ రెడ్డికి కుడి భుజంగా ఉంటూ…అన్నీ తానై నియజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని నడిపారు కొప్పుల నర్సింహారెడ్డి.

Related posts