telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

షాకిచ్చిన బంగారం… భారీగా పెరిగిన ధరలు

కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రికార్ఢ్ స్థాయిలో రూ. 50 వేలు దాటిపోయింది. మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 54, 280 కు పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 49, 760 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరగడంతో రూ. 52, 050 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరగడంతో రూ.47, 710 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే…హైదరాబాద్ కిలో వెండి ధర రూ. 200 తగ్గడంతో రూ. 63, 600కు చేరింది. బంగారం ధర భారీగా పెరిగితే…వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. దీపావళి, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం ధరలు పెరుగుతున్నట్లు ప్రముఖలు చెబుతున్నారు.

Related posts