మాల్దీవులంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆ అందమైన ప్రకృతి ఒడిలో సేదతీరాలని అందరూ భావిస్తారు. అయితే చాలామంది సెలెబ్రిటీలు మాత్రం తమకు టైం దొరికిందంటే చాలు తమకు ఇష్టమైన ప్రాంతంలో చక్కర్లు కొడుతుంటారు. చాలామంది సెలెబ్రిటీలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇటీవల రేణూదేశాయ్ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేయగా… అవి వైరల్ అయ్యాయి. తాజాగా బాలీవుడ్ నటి మందిరాబేడి తనకిష్టమైన మాల్దీవుల్లో సరదాగా ఎంజాయ్ చేస్తుంది. మందిరా తన భర్త రాజ్ కౌశల్, కుమారుడు విర్తో కలిసి మాల్దీవుల్లోని అందమైన లొకేషన్లలో చక్కర్లు కొడుతుంది. మాధూలోని సముద్రంలో దూకి పెద్ద సాహసమే చేసింది భామ. నీటిలోపల ఈత కొడుతూ ఉన్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఉదయం అద్భుతంగా గడిచింది..వ్యాయామం, సముద్రంలో ఈత, సూర్యోదయాన కాఫీ, సంగీతం..ఇలా ఎన్నో అద్భుతమైన యాక్టివిటీస్ అన్నీ ఈ విల్లాలో చేశాం. ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలనిపించడం లేదు” అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
previous post
“టీచర్స్ డే”ని విస్కీతో ముడిపెడుతూ… ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు