తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు, ఆమె భర్త భార్గవ్ రామ్ కు కిడ్నప్ కేసులో సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే భూమా అఖిలప్రియను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియాకు తెలియజేశారు . బోయిన్ పల్లి లో జరిగిన కిడ్నప్ పై సెక్షన్ 419,341,342, 452, 506, 365 ipc రెడ్ విత్ 149 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. గత ఏడాది కాలంగా హాఫిజ్ పేట భూమిపై వివాదం ఉందని, గతఏడాది కూడా ప్రవీణ్ రావు కేసులు పెట్టారని అన్నారు. గత రాత్రి 10 మంది ఐటి అధికారులమని చెప్పి ఇంట్లోకి వచ్చారని, ఐటి అధికారుల మాదిరిగానే ఇంట్లో సెర్చ్ చేశారని సీపీ పేర్కొన్నారు. కిడ్నాప్ కోసం వినియోగించిన కార్లకు ఫేక్ నెంబర్ ప్లేట్లు పెట్టినట్టు సీపీ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి భూ వివాదాలను సహించేది లేదని, ఈ కిడ్నాప్ వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని సీపీ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 11:30 గంటల సమయంలో భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని, అఖిలప్రియ తమ కష్టడీలోనే ఉన్నట్టుగా సీపీ పేర్కొన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post