యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని రొమాంటిక్ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి ప్యాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ప్రభాకరన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇటీవలే ఇటలీలో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న యూనిట్ ఇండియాకి తిరిగొచ్చింది. తాజాగా హైదరాబాద్లో మరో షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నారు. ఇందులో క్లైమాక్స్కు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఏకంగా రూ.30 కోట్ల ఖర్చుతో ఓ సెట్ వేయనున్నట్లు సమాచారం. హాలీవుడ్ మూవీ ‘గ్లాడియేటర్’కి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన నిక్ పోవెల్ ‘రాధేశ్యామ్’కి వర్క్ చేస్తున్నారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ సినిమా క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. యూరోప్ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో క్లైమాక్స్ భారీ స్థాయిలో చిత్రీకరించాలని దర్శకుడు రాధాకృష్ణ ప్లాన్ చేస్తున్నారు.
previous post
next post