telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్-ఆసీస్ వన్డే సిరీస్ పై దాదా ఏమన్నాడంటే..?

sourav ganguly as bcci president

భారత్ లో కరోనా విజృంభణ అధికంగా ఉండటంతో యూఏఈ వేదిక గా జరిగిన ఐపీఎల్ 2020 ముగిసిన అనంతరం భారత జట్టు సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కు వెళ్ళింది. అందులో భాగంగా ఈ రెండు జట్లు మొదట వన్డే సిరీస్ లో తలపడ్డాయి. మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ ను ఆసీస్ 2-1 తో సొంతం చేసుకుంది. మొదటి రెండు మ్యాచ్ లలో ఆసీస్ విజయం సాధించగా చివరి మ్యాచ్ లో భారత్ గెలిచింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా తర్వాత హార్దిక్, జడేజా ఇద్దరు  అర్ధశతకాలు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయం పై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ… సిరీస్ ఓడిపోయిన టీం ఇండియాకు చివర్లో మంచి విజయం దక్కింది అన్నాడు. అలాగే పాండ్యా, జడేజా త్వరలోనే భారత జట్టుకు ముఖ్యమైన ఆటగాళ్లుగా అవతరిస్తారు అని తెలిపాడు. అయితే ఈ రేడు జట్ల మధ్య శుక్రవారం నుండి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఇందులోనైనా భారత్ సిరీస్ కైవసమ్ చేసుకోవాలని దాదా ఆకాంక్షిస్తున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts