కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతికి మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ సినీనటిగా ఆమెకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉందనీ అన్నారు. విజయశాంతి సేవలను దక్షిణాది రాష్ట్రాల్లో వాడుకుంటే పార్టీకి లాభం కలుగుతుందన్నారు.
రాబోయే రోజుల్లో పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టేవాళ్లు ముఖ్యమంత్రి పదవిపై ఆశలు లేకుండా పార్టీ కోసం పని చేయాలని జగ్గారెడ్డి సూచించారు.పీసీసీ పీఠం కావాలనుకునేవాళ్లు తమ సొంత ఖర్చులతో పార్టీని నడిపేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే పీసీసీకి, కాబోయే సీఎంకు మధ్య సమన్వయం ఉంటుందని తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఈ లోక్ సభ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేననీ, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనిజగ్గారెడ్డి జోస్యం చెప్పారు.