తెలంగాణలో మహబూబ్నగర్, కామారెడ్డి, బోధన్లో మున్సిపల్ రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. టెండర్ ఓటు వేసినచోట ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని గుర్తించి ఈసీ రీపోలింగ్ నిర్వహిస్తుంది. టెండర్ ఓటు వల్ల మూడు చోట్ల ఒక్కో పోలింగ్ కేంద్రంలో అధికారులు రీపోలింగ్ను చేపట్టారు.
బోధన్లోని 32వ వార్డు, 87వ పోలింగ్ కేంద్రంలో.. మహబూబ్నగర్లోని 41వ వార్డు 198వ కేంద్రంలో.. కామారెడ్డిలోని 41వ వార్డు 101వ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులు రీపోలింగ్ను చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహిస్తారు.