దసరా పండగ నేపథ్యంలో తెలంగాణ అంగన్ వాడీ ఉద్యోగులకు ఈ నెల ముందే వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 83 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అడిగిన వెంటనే అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాల కోసం నిధులు విడుదల చేయడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కేసిఆర్ కు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెల మాసాంతంలో వేతనాలు అందుతున్నాయి. అయితే ఈ నెలలో దసరా పండగ మొదటి వారంలోనే రావడంతో వేతనాలు లేకపోవడం వల్ల పండగకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని తెలంగాణ అంగన్ వాడీ సంఘం నేతలు మంత్రికి విజ్ణప్తి చేశారు.