ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎవరిని వదలడం లేదు. వారు వీరు అనే తేడా లేకుండా అందరిని తన చెంతన చేర్చుకుంటుంది. అయితే కరోనా బారిన పడుతున్న ఆటగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఆడుతున్నవారో లేక మాజీ ఆటగాళ్లో ఎవరో ఒకరికి కరోనా పాజిటివ్ అని ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రోజు ఫుట్ బాల్ ప్లేయర్ మహమ్మద్ ఎల్నెనికు కరోనా పాజిటివ్ అని ఈజిప్షియన్ ఫుట్బాల్ అసోసియేష్(ఈఎఫ్ఏ) ప్రకటించింది. మహమ్మద్ ఆర్సెనల్ జట్టులో మిడ్ఫీల్డర్గా ఆడుతున్నాడు. అయితే కరోనా పాజిటివ్ అని తేలడంతో అతడి తగిన చికిత్స తీసుకుంటున్నాడని తెలిపారు. అతడికి ఎటువంటి కరోనా లక్షణాలు లేవని, అంతా బాగానే ఉన్నాడని తెలిపారు. అతడికి ఆదివారం చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఈజిప్ట్ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ చివరి వారంలో కరోనా బారిన పడ్డాడు. అతడు అతితక్కువ లక్షణాలతో ఇబ్బంది పడ్డాడని ఈజిప్ట్కు చెందిన డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం మహమ్మద్ లేకపోవడం జట్టుకు కాస్త ఇబ్బనది కలిగించే విషయమే అంటున్నారు.
previous post
next post
బికినీలో అనుష్క శర్మ… కోహ్లీ రియాక్షన్…!