telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ వాళ్లు నలుగురు గెలవగానే ఆగడం లేదు: కేటీఆర్‌

ktr trs president

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బీజేపీ నేతల పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ వాళ్లు నలుగురు గెలవగానే ఆగడం లేదని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్‌ వ్యాఖ్యలపై మాట్లాడి తన స్థాయి తగ్గించుకోనన్నారు. తమ పార్టీ నేత డీఎస్‌ మొన్నటి సమావేశానికి కూడా వచ్చారని, అయితే కేంద్రహోంమంత్రిని డీఎస్‌ ఎందుకు కలిశారో తెలియదని కేటీఆర్‌ చెప్పారు.

తెలంగాణ కొత్త మున్సిపల్‌ చట్టం పై ప్రశంసలు కురిపించారు. ఈ రోజు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2009 మున్సిపల్ చట్టం అద్భుతంగా ఉందని కేటీఆర్‌ కితాబిచ్చారు. రాజకీయ జోక్యం ఉండకుండా చట్టాన్ని అమలు చేస్తామని, నోటీస్ ఇవ్వకుండా కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేలే బాధ్యులని అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు రాష్ట్రవ్యాప్తంగా వేగంగా జరుగుతోందని ఆయన తెలిపారు.

Related posts