తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలను స్వీకరించారు. ఈ ఉదయం 9 గంటలకు హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అధ్యక్షుడి కుర్చీలో ఆసీనులయ్యారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాతే బాధ్యతలను స్వీకరించాలని ఇంతకు ముందు సంజయ్ భావించారు.
అయితే, రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ పరమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన నేపథ్యంలో ఈరోజు ఆయన బాధ్యతలను స్వీకరించారు. లాక్ డౌన్ ఉన్న కారణంగా ఈ కార్యక్రమానికి కార్యకర్తలు ఎవరూ రావద్దని ముందుగానే సంజయ్ కోరారు. కొందరు కీలక నేతలు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మార్చి 10న బండి సంజయ్ ను బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.